స్టాక్‌మార్కెట్లలో రిలీఫ్‌ ర్యాలీ

17 Mar, 2020 09:53 IST|Sakshi

ముంబై స్టాక్‌మార్కెట్లు మంగళవారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య ప్రారంభమైనా కొనుగోళ్లు ఊపందుకోవడంతో భారీగా లాభపడుతున్నాయి. ఆరంభంలో భారీగా పతనమైన సూచీలు ప్రస్తుతం పాజిటివ్‌ జోన్‌లో కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావంతో కుదేలైన స్టాక్‌మార్కెట్లలో పుల్‌బ్యాక్‌ ర్యాలీ చోటుచేసుకుంది. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ ‌524 పాయింట్ల లాభంతో 31,911 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 154 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 9352 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

చదవండి : మళ్లీ అదే వరస : కుప్పకూలిన సూచీలు

మరిన్ని వార్తలు