రూ.130 కోట్లు సమీకరించిన రిన్యూబై

3 Jul, 2019 09:20 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: డిజిటల్‌ ఇన్సూ్యరెన్స్‌ ప్లాట్‌ఫామ్‌ రిన్యూబై.కామ్‌ రూ.130 కోట్ల నిధులను సమీకరించింది. సిరీస్‌–బీ రౌండ్‌లో భాగంగా లోక్‌ క్యాపిటల్, ఐఐఎఫ్‌ఎల్‌ ఏఎంసీ, అమికుస్‌ క్యాపిటల్స్‌ ఈ పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుతం రిన్యూబైలో 25 వేల పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) పార్టనర్స్‌ నమోదయ్యారు. ఏటా రూ.500 కోట్ల ప్రీమియం వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం 450 నగరాల్లో సేవలందిస్తున్నామని, 2020 నాటికి వెయ్యి నగరాలకు.. 2 లక్షల పీఓఎస్‌లను లకి‡్ష్యంచామని కంపెనీ సీఈఓ బాలచందర్‌ శేఖర్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు