ఉన్నత స్థాయి ప్రమాణాల వల్లే ఆదరణ

27 Apr, 2017 00:32 IST|Sakshi
ఉన్నత స్థాయి ప్రమాణాల వల్లే ఆదరణ

భారతి సిమెంట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మల్లారెడ్డి
కడప: భారతి సిమెంట్స్‌ నాణ్యత విషయంలో అగ్రగామిగా నిలిచిందని కంపెనీ మార్కెటింగ్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంసీ మల్లారెడ్డి అన్నారు. బుధవారం కడపలోని మానస హోటల్‌లో నిర్వహించిన సబ్‌ డీలర్ల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

భారతి సిమెంట్స్‌ ఉన్నత స్థాయి నాణ్యత ప్రమాణాలను పాటిస్తోందని, సరైన సర్వీసులు అందిస్తోందని అందుకే నమ్మకమైన సిమెంటుగా తక్కువ కాలంలోనే వినియోగదారుల నమ్మకాన్ని సాధించిందని చెప్పారాయన. కార్యక్రమంలో కంపెనీ సీనియర్‌ టెక్నికల్‌ మేనేజర్‌ సి.ఓబుల్‌రెడ్డి, కడప జిల్లాకు చెందిన పలువురు సబ్‌ డీలర్లు, కంపెనీ మార్కెటింగ్‌ ఏజీఎం ఎం.నరసింహారెడ్డి, సీనియర్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ ఎ.ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు