ముంబై : దేశీయ టెలికాం రంగంలో అతిపెద్ద గేమ్ ఛేంజర్ ఫైబర్ ఆధారిత ఫిక్స్డ్లైన్ బ్రాడ్బ్యాండ్ సర్వీసులు‘ జియోగిగాఫైబర్’ ను రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కూతురు ఇషా అంబానీ, కొడుకు ఆకాశ్ అంబానీలు మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. నేడు ముంబైలోని న్యూ మెరైన్ లైన్స్లో బిర్లా మధుశ్రీ ఆడిటోరియంలో జరిగిన 41వ వార్షికోత్సవ సమావేశంలో ఈ సర్వీసులను ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. జియోగిగాఫైబర్ ద్వారా అందించే ఫీచర్లను ఆకాశ్, ఇషా అంబానీలు ప్రజెంటేషన్ ద్వారా ఇన్వెస్టర్లకు వివరించారు. బ్రాడ్బ్యాండ్ సేవలు ఆగస్టు 15 నుంచే కస్టమర్ల ముందుకు తీసుకురానున్నట్టు ముఖేష్ అంబానీ చెప్పారు. సెటాప్బాక్స్ ద్వారా టీవీలో కూడా జియోగిగాఫైబర్ సేవలను అందించనున్నట్టు ఆకాశ్, ఇషాలు తెలిపారు. జియోగిగాఫైబర్ ద్వారా జియోటీవీ కాలింగ్ ఫీచర్ను కూడా తీసుకొచ్చారు. స్మార్ట్ హోమ్ టెక్నాలజీ, టీవీ కాలింగ్లు జియోగిగాఫైబర్ రెండు ముఖ్యమైన ఫీచర్లని తెలిపారు. జియో.కామ్ లేదా మైజియో ద్వారా ‘జియోగిగాఫైబర్’ సర్వీసులను రిజిస్టర్ చేసుకోవచ్చని రిలయన్స్ పేర్కొంది.
మూడు ముఖ్యమైన యాప్స్ యూట్యూబ్, ఫేస్బుక్, వాట్సాప్లను జియో ఫోన్ యూజర్ల కోసం ప్రత్యేకంగా రూపొందించినట్టు ఆకాశ్, ఇషాలు చెప్పారు. జియో ఫోన్లో ఇవి ఎలా పనిచేస్తాయో కూడా చూపించారు. వీటిని ఆగస్టు 15 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్టు ముఖేష్ అంబానీ తెలిపారు. జియోఫోన్ హైఎండ్ మోడల్ జియోఫోన్ 2ను కూడా ఇషా, ఆకాశ్లు ప్రవేశపెట్టారు.
గృహాలకు, వర్తకులకు, చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలకు, పెద్దపెద్ద వ్యాపారాలకు ఫైబర్ కనెక్టివిటీని విస్తరించనున్నామని రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తెలిపారు. 1,100 నగరాలకు అత్యున్నతమైన ఫైబర్ ఆధారిత బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీ సొల్యూషన్స్ను ఆఫర్చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచంలోనే టాప్ - 5 బ్రాడ్బ్యాండ్ దేశాల్లో భారత్ను ఒకటిగా నిలుపాలని నిర్ణయించుకున్నామని చెప్పారు.
ముఖేష్ అంబానీ ప్రసంగంలో పలు ముఖ్యాంశాలు :