హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: అప్పుల భారం తగ్గించుకోవడానికి ఎస్పీవీ మోడల్లో చేపట్టిన రోడ్ ప్రాజెక్టులను విక్రయించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇన్ఫ్రా కంపెనీ ఎన్సీసీ ప్రకటించింది. అనుబంధ కంపెనీలైన వెస్ట్రన్ యూపీ టోల్వే లిమిటెడ్, బెంగళూరు ఎలివేటెడ్ టోల్వే లిమిటెడ్లో వాటాలను విక్రయించడం ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకునే పనిలో ఉన్నట్లు ఎన్సీసీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియచేసింది.
ఈ మధ్యనే ఎన్సీసీ పవర్ప్రాజెక్స్లో మెజార్టీ వాటాను సింగపూర్కి చెందిన సెంబ్కార్ప్కు విక్రయించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన నగదు ఈ ఆర్థిక ఏడాదిలోగా వస్తుందని ఎన్సీసీ తెలిపింది. ఈ వార్తల నేపథ్యంలో ఎన్సీసీ షేరు 6 శాతం పెరిగి రూ. 80 వద్ద ముగిసింది.