మూడు నెలల గరిష్టానికి రూపాయి విలువ
ట్రేడింగ్ ఆరంభంలోనే 51పైసలు జంప్
సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపాయి మరింత స్థిరంగా కొనసాగుతోంది. డాలరు మారకంలో ట్రేడింగ్ ఆరంభంలోనే భారీగా ఎగిసి, అనంతరం మరింత పుంజుకున్న రూపాయి మూడు నెలల గరిష్టాన్ని తాకింది. బుధవారం నాటి 70.62 ముగింపుతో పోలిస్తే నేడు (గురువారం,నవంబరు 29) ఏకంగా 51పైసల లాభంతో 70.11 వద్ద ఆరంభమైంది. అనంతరం మరింత జోష్గా కొనసాగుతోంది. ప్రస్తుతం 65పైసలు ఎగిసి 70.12 స్థాయికి చేరింది. అటు దేశీయ స్టాక్మార్కెట్లు కూడా భారీ లాభాలతో మొదలైనాయి.