సాక్షి, ముంబై : ఎగ్జిట్ పోల్స్ జోష్ దేశీయ ఈక్విటీ, కరెన్సీ మార్కెట్లనుభారీగా ప్రభావితం చేస్తోంది. లాభాల దౌడు తీస్తున్నాయి. దేశీయ కరెన్సీ రూపాయి భారీ లాభాలతో ట్రేడింగ్ను ఆరంభించింది. శుక్రవారం నాటి ముగింపు 70.22 తో పోలిస్తే రూపాయి 9.49వద్ద ప్రారంభమైంది. డాలరు మారకంలో 73 పైసలు ఎగిసింది. దీంతో రెండు వారాల గరిష్టాన్ని తాకింది. అంతేకాదు డిసెంబరు 2018 తరువాత ఓపెనింగ్లో భారీగా లాభపడటం ఇదే తొలిసారి.
అటు బీజేపీకే ప్రజలు పట్టం కట్టనున్నట్లు సర్వేలన్నీ వెల్లడించడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో దేశీయ స్టాక్మార్కెట్లు ఏకంగా 800 పాయింట్లు ఎగిశాయి.