సాక్షి,ముంబై: దేశీయ కరెన్సీ రూపాయిలో వరుస బలహీనత కొనసాగుతోంది. మంగళవారం నాటి ముగింపుతో పోలిస్తే రూపాయి బుధవారం నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించింది. 16పైసలు నష్టపోయి 70.64 వద్ద ట్రేడింగ్ను ప్రారంభించింది. మంగళవారం 70.49 వద్ద ముగిసింది.
మరోవైపు ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ అధ్యక్షతన రెండురోజులపాటు సమావేశమైన మానిటరీ పాలసీ కమిటీ నేడు పరపతి నిర్ణయాలు ప్రకటించనుంది. కీలక వడ్డీరేట్లను పెంచుతుందా, యథాతథంగా ఉంచుతుంది అనేకి మార్కెట్లకు కీలకంగా ఉండనుంది.