56 పైసలు ఎగిసిన రూపాయి

11 Mar, 2020 20:01 IST|Sakshi

సాక్షి, ముంబై:  డాలరుమారకంలో  దేశీయ కరెన్సీ రూపాయి  బుధవారం భారీగా  కోలుకుంది. ఇంటర్‌బ్యాంక్ విదేశీ మారక మార్కెట్లో, రూపాయి 73.88 వద్ద  ట్రేడింగ్‌ను ఆరంభించిన రూపాయి ఇంట్రాడే లో 73.55 వద్ద గరిష్ట స్థాయిని తాకింది.  చివరకు డాలర్‌తో పోలిస్తే 73.61 వద్ద స్థిరపడింది. అంతకుముందు ముగింపుతో పోలిస్తే 56 పైసల పెరుగుదలను నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 (కరోనావైరస్) వేగంగా విస్తురిస్తున్న నేపథ్యంలో ఆర్థిక మందగమనం పెరుగుతున్న భయాల మధ్య మార్చి 9 న రూపాయి  అమెరికా డాలర్‌తో పోలిస్తే 74.17 వద్ద 17 నెలల కనిష్ట స్థాయి కు పడిపోయిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు