బీఎండబ్ల్యూ 5 సిరీస్‌ కొత్త వెర్షన్‌

30 Jun, 2017 00:29 IST|Sakshi
కొత్త కారుతో సచిన్‌

ధర రూ.49.9 లక్షలు – రూ.61.3 లక్షలు
ముంబై: లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం బీఎండబ్ల్యూ గురువారం భారత మార్కెట్లో మోడల్‌ 5 సిరీస్‌లో లేటెస్ట్‌ వెర్షన్‌ కారును ఆవిష్కరించింది. దీని ధర రూ. 49.9 లక్షలు–61.3 లక్షలు(ఎక్స్‌ షోరూం ముంబై). కొత్త మోడల్‌ డీజిల్, పెట్రోల్‌ ఇంజిన్‌ ఆప్షన్లతో లభిస్తుంది. 3 వేరియంట్స్‌లో లభించే డీజిల్‌ ఇంజిన్‌ కారు ధర రూ. 49.9 లక్షల నుంచి రూ. 61.3 లక్షల దాకా ఉండనుండగా, పెట్రోల్‌ వెర్షన్‌ రేటు రూ. 49.9 లక్షలుగా ఉంటుంది.

డ్రైవర్‌ అసిస్టెన్స్, జెస్చర్‌ కంట్రోల్, రిమోట్‌ కంట్రోల్‌ పార్కింగ్‌ మొదలైన ఫీచర్స్‌ ఉంటాయి. అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్స్‌లో సిరీస్‌ 5 ఒకటని బీఎండబ్ల్యూ ఇండియా గ్రూప్‌ ప్రెసిడెంట్‌ విక్రమ్‌ పవా పేర్కొన్నారు. భారత్‌ విభాగం కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు మరో రూ. 130 కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు