శాంసంగ్ గెలాక్సీ ఏ 31 లాంచ్

4 Jun, 2020 14:13 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్త  స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కట్లో  లాంచ్  చేసింది. గెలాక్స్ ఏ30కి కొనసాగింపుగా  శాంసంగ్  ఏ 31 ను   గురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది.  ఈ స్మార్ట్ ఫోన్ ను ఇప్పటికే గ్లోబల్ గా  ప్రారంభించింది. 

శాం‌సంగ్ గెలాక్సీ ఏ 31 6 జీబీ ర్యామ్, 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వేరియంట్‌ ధరను రూ. 21,999 గా ఉంచింది. ఈ రోజు (జూన్ 4 ) నుండే  దేశంలో అమ్మకాలు మొదలు. శాంసంగ్  ఒపెరా హౌస్‌తో సహా ఆఫ్‌లైన్ రిటైలర్లతో పాటు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బెనో, అలాగే శాం‌సంగ్ ఇండియా ఈస్టోర్ ద్వారా అందుబాటులో ఉంటుంది.
 

శాంసంగ్ ఏ31 ఫీచర్లు 
6.40 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే 
మీడియాటెక్ హెలియో పి 65ప్రాసెసర్ 
ఆండ్రాయిడ్ 10
1080x2400 పిక్సెల్స్ రిజల్యూషన్
6 జీబీ ర్యామ్
128 జీబీ  స్టోరేజ్
20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
48+8+5+5 మెగాపిక్సెల్ క్వాడ్ రియర్  కెమెరా
5000 ఎంఏహెచ్  బ్యాటరీ సామర్థ్యం

మరిన్ని వార్తలు