రెడ్‌మికి షాక్‌ : బడ్జెట్‌ ధరలో గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌

16 Apr, 2019 12:04 IST|Sakshi
శాంసంగ్‌ గెలాక్సీ ఏ 2 కోర్‌

షావోమి పోటీగా  గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో

గెలాక్సీ ఏ 2 కోర్‌: రూ.5290

సాక్షి, న్యూఢిల్లీ :  సౌత్‌ కొరియా ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌  బడ్జెట్‌ ధరలో కొత్త గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ను  భారత మార్కెట్లో విడుదల  చేసింది. ప్రధానంగా చైనా మొబైల్‌  తయారీదారు షావోమి తీసుకొచ్చిన బడ్జెట్‌  ఫోన్‌ రెడ్‌మిగో కి  పోటీగా  ఈ డివైస్‌ను లాంచ్‌ చేసింది.  గెలాక్సీ ఏ2 కోర్‌ పేరుతో , ఆండ్రాయిడ్‌ గో ఆధారిత  స్మార్ట్‌ఫోన్‌ను శాంసంగ్‌ ఆవిష్కరించింది. దీని ధర 5290  రూపాయలు గా నిర్ణయించింది.  

 గెలాక్సీ ఏ2 కోర్‌ ఫీచర్లు
5 అంగుళాల డిస్‌ప్లే
960x540 పిక్సెల్స్‌ స్క్రీన్‌ రిజల్యూషన్‌ 
1. 6 ఆక్టాకోర్ ప్రాసెసర్‌,  7870 సాక్‌
1జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌
256 దాకా విస్తరించుకునే అవకాశం
5 ఎంపీ రియర్‌ కెమెరా
5 ఎంపీ సెల్ఫీ కెమెరా
2600 ఎంఏహెచ్‌ బ్యాటరీ

కాగా షావోమి తీసుకొచ్చిన రెడ్‌మి గో ధర రూ. 4499.  అలాగే రెడ్‌మి గో లో 8 ఎంపీ రియర్‌ కెమెరాను పొందుపర్చగా, బ్యాటరీ  సామర్ధ్యం 3000 ఎంఏహెచ్‌ గా ఉంది. 
 

మరిన్ని వార్తలు