ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో 4% వాటా విక్రయం

27 Sep, 2018 01:04 IST|Sakshi

డీల్‌ విలువ రూ.482 కోట్లు 

ముంబై: ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 4 శాతం వాటాను విక్రయించాలని ఎస్‌బీఐ నిర్ణయించింది. యాక్సిస్‌ ఏఎమ్‌సీ, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ సంస్థలు ప్రమోట్‌ చేస్తున్న ఫండ్స్‌ ఈ వాటాను కొనుగోలు చేయనున్నాయి.  ఈ డీల్‌ విలువ రూ.482 కోట్లు. ఈ డీల్‌ పరంగా చూస్తే, ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ విలువ రూ.12,000 కోట్లని అంచనా.

ఈ ఒప్పందంలో భాగంగా యాక్సిస్‌  ఏఎమ్‌సీ తరపున యాక్సిస్‌ న్యూ ఆపర్చునిటీస్‌ ఏఐఎఫ్‌–వన్‌ ఫండ్‌ 1.65 శాతం వాటాను, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌కు చెందిన పీఐ ఆపర్చునిటీస్‌ ఫండ్‌–వన్‌ 2.35 శాతం వాటాను కొనుగోలు చేస్తాయి. ఈ వాటా విక్రయానంతరం ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌లో ఎస్‌బీఐకు 70 శాతం, జాయింట్‌ వెంచర్‌ భాగస్వామి ఐఏజీ ఇంటÆ 

మరిన్ని వార్తలు