ఏప్రిల్‌1 నుంచి అనుబంధ బ్యాంకుల విలీనం: ఎస్‌బీఐ

24 Feb, 2017 01:07 IST|Sakshi
ఏప్రిల్‌1 నుంచి అనుబంధ బ్యాంకుల విలీనం: ఎస్‌బీఐ

న్యూఢిల్లీ: ఎస్‌బీఐలో ఐదు అనుబంధ బ్యాంకుల విలీన కార్యక్రమం వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ బికనీర్‌ అండ్‌ జైపూర్‌ (ఎస్‌బీబీజే), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ మైసూర్‌ (ఎస్‌బీఎం), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ట్రావన్‌కోర్‌(ఎస్‌బీటీ) స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ పాటియాలా(ఎస్‌బీపీ), స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌ (ఎస్‌బీహెచ్‌) ఆస్తులను ఏప్రిల్‌ 1 నుంచి ఎస్‌బీఐకి బదలాయిస్తామని నియంత్రణ సంస్థలకు ఎస్‌బీఐ సమాచారం అందించింది. విలీనం అనంతరం అనుబంధ బ్యాంకుల బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్‌ ట్రస్టీల మినహా మిగిలిన ఉద్యోగులు అందరూ ఎస్‌బీఐ ఉద్యోగులుగా మారనున్నారు.

>
మరిన్ని వార్తలు