ఆర్‌ఐఎల్ గ్యాస్ కేసులో విదేశీ ఆర్బిట్రేటర్ ఎంపిక

1 Apr, 2014 00:20 IST|Sakshi
ఆర్‌ఐఎల్ గ్యాస్ కేసులో విదేశీ ఆర్బిట్రేటర్ ఎంపిక

న్యూఢిల్లీ: కేజీ-డీ6 గ్యాస్ వివాదానికి సంబంధించి మూడో ఆర్బిట్రేటర్‌గా ఆస్ట్రేలియా మాజీ జడ్జి జేమ్స్ జాకబ్ స్పిగెల్‌మ్యాన్‌ని సుప్రీం కోర్టు ఎంపిక చేసింది. జస్టిస్ ఎస్‌ఎస్ నిజ్జర్ సారథ్యంలోని సుప్రీం కోర్టు బెంచ్ ఆయన పేరును సూచించింది. విదేశీ ఆర్బిట్రేటర్‌గా స్పిగెల్‌మ్యాన్ పక్షపాతం లేకుండా వ్యవహరిస్తారని బెంచ్ పేర్కొంది. కేజీ-డీ6లో గ్యాస్ ఉత్పత్తి భారీగా పడిపోయిన అంశంలో ఆర్‌ఐఎల్‌పై కేంద్రం 1.79 బిలియన్ డాలర్ల మేర జరిమానా విధించిన సంగతి తెలిసిందే. దీనిపైనే ఆర్‌ఐఎల్ ఆర్బిట్రేషన్(మధ్యవర్తిత్వ) ప్రక్రియ ప్రారంభిం చింది. ఇందుకు సంబంధించిన త్రిసభ్య ఆర్బిట్రేషన్ ప్యానెల్‌లో ఇప్పటికే ఇద్దరు నియమితులు కాగా.. మూడో ఆర్బిట్రేటర్‌గా స్పిగెల్‌మ్యాన్ పేరు తాజాగా తెరపైకి వచ్చింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వేల్స్‌లో చీఫ్ జస్టిస్‌గాను, లెఫ్టినెంట్ గవర్నర్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు.
 

మరిన్ని వార్తలు