పెన్నా సిమెంట్‌ ఐపీఓకు సెబీ ఓకే

5 Jun, 2019 09:26 IST|Sakshi

ఐపీఓ సైజు రూ.1,550 కోట్లు

న్యూఢిల్లీ: పెన్నా సిమెంట్‌ ఇండస్ట్రీస్‌ ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పెన్నా సిమెంట్‌... ఈ ఐపీఓ ద్వారా రూ.1,550 కోట్లు సమీకరించనున్నది. ఐపీఓలో భాగంగా రూ.1,300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. అంతే కాకుండా రూ.250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో విక్రయిస్తారు. ఈ ఐపీఓ ద్వారా సమీకరించిన నిధులను రుణ భారం తగ్గించుకోవడానికి, సాధారణ వ్యాపార కార్యకలాపాలకు వినియోగించుకోవాలని కంపెనీ యోచిస్తోంది. ఈ ఐపీఓకు బుక్‌ రన్నింగ్‌  లీడ్‌ మేనేజర్లుగా ఎడెల్‌వీజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఐఐఎఫ్‌ఎల్‌ హోల్డింగ్స్, జేఎమ్‌ ఫైనాన్షియల్, యస్‌ సెక్యూరిటీస్‌ వ్యవహరిస్తున్నాయి. పెన్నా సిమెంట్‌ కంపెనీకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో నాలుగు సిమెంట్‌ ప్లాంట్లు, రెండు గ్రైండింగ్‌ యూనిట్లున్నాయి.

మరిన్ని వార్తలు