బలపడిన సెంటిమెంటు : లాభాల ముగింపు

27 May, 2019 15:47 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఆరంభంలో కాస్త ఒడిదుడుకులు కనిపించినా  వెంటనే పుంజుకుంది. కానీ  మిడ్‌ సెషన్‌ తరువాత అమ్మకాలు  పుంజుకోవడంతో వెనుకబడినా,  చివరికి పటిష్టంగా ముగిసింది. సెన్సెక్స్‌ 249 పాయింట్లు ఎగిసి 39683వద్ద, నిఫ్టీ81 పాయింట్లు లాభపడి 11824 వద్ద ముగిసింది.  

బ్యాంకులు, రియల్టీ షేర్లతో పాటు  దాదాపు అన్ని సెక్టార్లు లాభపడ్డాయి. టాటా స్టీల్‌, ఎస్‌బ్యాంకు, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్టీ  హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌విన్నర్స్గా నిలిచాయి. కాగా  కోల్‌ ఇండియా, బజాజ్‌ఫైనాన్స్‌,  సన్‌ఫార్మ, హీరో మోటో, మారుతి భారతి  ఎయిర్‌టెల్‌,  ఓఎన్‌జీసీ నష్టపోయాయి.  
 

మరిన్ని వార్తలు