సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ లాభాలతో ముగిసాయి. అమెరికా, యూరోపియన్ మార్కెట్ల పాజిటివ్ ధోరణితో కీలక సూచీలు రెండో రోజు కూడా ఉత్సాహంగా ముగిశాయి. ఆరంభంనుంచి పాజిటివ్గా ఉన్న మార్కెట్లలో మిడ్ సెషన్ నుంచీ కొనుగోళ్లు మరింత పెరగడంతో సెన్సెక్స్ 318 పాయింట్లు జంప్చేసి 35,775 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 81 పాయింట్ల లాభంతో 10,763 వద్ద స్థిరపడింది. పీఎస్యూ బ్యాంక్స్ స్వల్పంగా నష్టపోగా, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆటో, ఫార్మా, ఐటీ లాభపడ్డాయి.
యస్ బ్యాంక్, ఐటీసీ, టాటా మోటార్స్, ఇండస్ఇండ్, వేదాంతా, సన్ ఫార్మా, ఆర్ఐఎల్, గ్రాసిమ్, హిందాల్కో, డాక్టర్ రెడ్డీస్ టాప్ లూజర్స్గా నిలిచాయి. జంప్చేశాయి. మరోవైపు ఐబీ హౌసింగ్, గెయిల్, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ, ఎస్బీఐ, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, బజాజ్ ఆటో, ఐవోసీ నష్టాల్లో ముగిసాయి.
అటు డాలరు మారకంలో రుపీ 28 పైసలు ఎగిసి 71.65 వద్ద ముగిసింది.