స్వల్ప నష్టాల్లో ప్రధాన సూచీలు

11 Sep, 2014 16:14 IST|Sakshi
స్వల్ప నష్టాల్లో ప్రధాన సూచీలు
హైదరాబాద్: భారత స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో ముగిసాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావం తదితర అంశాలు ప్రభావంతో సెన్సెక్స్ 61 పాయింట్ల నష్టంతో 26995 పాయింట్ల వద్ద, నిఫ్టీ 8 పాయింట్లు క్షీణించి 8085 వద్ద ముగిసాయి. సెన్సెక్స్ 27 మార్కు దిగువన ముగియడం గమనార్హం. 
 
ఐడీఎఫ్ సీ, ఎస్ బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, భెల్, హీరో మోటో కార్ప్ కంపెనీలు లాభాల్ని నమోదు చేసుకోగా, సన్ ఫార్మా, ఓఎన్ జీసీ, కోల్ ఇండియా, ఎన్ ఎమ్ డీసీ, లుపిన్ లు నష్టాలతో ముగిసాయి. 
>
మరిన్ని వార్తలు