డెడ్లీ వైరస్‌ : కుప్పకూలిన స్టాక్‌మార్కెట్‌

28 Feb, 2020 10:07 IST|Sakshi

ముంబై : కరోనా వైరస్‌ భయాలు గ్లోబల్‌ మార్కెట్లను వెంటాడిన ఫలితంగా  స్టాక్‌మార్కెట్లు శుక్రవారం కుప్పకూలాయి. డెడ్లీ వైరస్‌ ప్రపంచ దేశాలకు వేగంగా విస్తరిస్తుండటంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను ప్రభావితం చేసింది. మెటల్‌, ఐటీ, రియల్‌ఎస్టేట్‌ సహా అన్ని రంగాల షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుతున్నాయి. టాటా స్టీల్‌, టాటా ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ తదితర షేర్లు నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 1110  పాయింట్ల నష్టంతో 38,635 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 313 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,319 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.
 

మరిన్ని వార్తలు