సాక్షి, ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఈ వారంలో వరుసగా రెండో సెషన్లో కూడా భారీగా నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 295 పాయింట్ల నష్టంతో 37, 290 వద్ద, నిఫ్టీ 99 పాయింట్లు క్షీణించి 11,279 వద్ద ముగిసింది. మరోవైపు డాలర్ రుపీ వీక్నెస్ కొనసాగుతోంది. ఫార్మ, ఐటీ తప్ప అన్ని సెక్టార్లు నష్టల్లో ముగిశాయి. ముఖ్యంగా విజయ, దేనా,బీవోబీ బ్యాంకుల విలీన వార్తలతో బ్యాంక్ సెక్టార్ ప్రతికూలంగా స్పందించింది. దాదాపు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు నష్టపోయాయి.
ఎస్బీఐ, బ్యాంకు ఆఫ్ బరోడా , ఇండియా బుల్స్, హిందాల్కో ఇన్ఫోసిస్, ఐషర్, టాటా మోటార్స్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో టాప్ లూజర్స్గా ఉన్నాయి. గెయిల్, డా.రెడ్డీస్, టైటన్, ఎస్బ్యాంక్, ఓఎన్జీసీ, హెచ్యూఎల్, హెచ్డీఎఫ్సీ లాభపడ్డాయి. విలీనం వార్తలతో దేనా బ్యాంకు లాభపడగా, విజయ బ్యాంకు 7శాతం, బీవోబీ 17శాతం నష్టపోయింది.