లాభాల ముగింపు : 10800 పైకి నిఫ్టీ

4 Sep, 2019 15:37 IST|Sakshi

సాక్షి, ముంబై : ఆరంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్న స్టాక్‌మార్కెట్లు లాభాలతో ముగిసాయి.  రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడిన  సెన్సెక్స్‌  చివరికి 162 పాయింట్లు ఎగిసి  36724 వద్ద, నిఫ్టీ 47 పాయింట్లు లాభపడి 10844 వద్ద ముగిసాయి. తద్వారా నిఫ్టీ 10800 ఎగువకు చేరింది. మారుతి సుజుకి, సన్‌ఫార్మ,  బ్రిటానియా, ఆసియన్‌  పెయింట్స్‌, టాటా మోటార్స్‌, టైటన్‌  టాప్‌ లూజర్స్‌గా ముగియగా,  టాటా స్టీల్‌,  ఎస్‌బీఐ, భారతి ఎయిర్‌టెల్‌ , వేదాంతా, ఓఎ న్‌జీసీ హెచ్‌సీఎల్‌ టెక్‌, ఎన్‌టీపీసీ,  టాప్‌ గెయినర్స్‌గా ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు