భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

15 Sep, 2014 16:53 IST|Sakshi

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ప్రారంభమై భారీ నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 250 పాయింట్లు పతనమై 26,802 వద్ద ముగిసింది. ఈ ఉదయం ట్రేడింగ్ ఆరంభంకాగానే సెన్సెక్స్185 పాయింట్లు క్షీణించి  27 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఆ తర్వాత మరింత పతనమైంది.

ఎన్ఎస్ఈ సూచి నిఫ్టీ 63 పాయింట్ల క్షీణించి 8,042 వద్ద ముగిసింది. మెటల్, ఎఫ్ఎమ్ జీసీ, పవర్ కేపిటల్ గూడ్స్, ఐటీ షేర్లు నష్టాలు బాట పట్టడంతో మార్కెట్ అధోముఖంగా పయనించింది.

మరిన్ని వార్తలు