సాక్షి,ముంబై: దేశీయస్టాక్మార్కెట్లు లాభాలతో ముగిశాయి. రోజంతా లాభనష్టాల మధ్య కొనసాగిన కీలక సూచీల్లో చివరి గంటలో అమ్మకాలు ఊపందుకున్నాయి. దీంతో సెన్సెక్స్ 132 పాయింట్లు లాభపడి 34, 865 వద్ద, నిఫ్టీ 40 పాయింట్లు ఎగిసి 10,512 వద్ద ముగిశాయి. ముఖ్యంగా ఫార్మ, ఐటీ సెక్టార్లు లాభాలు మార్కెట్లకు ఊతమిచ్చాయి. అయితే ఆటో, ప్రయివేట్ బ్యాంక్స్, మెటల్ నష్టపోయాయి.
డీఆర్ఎల్, సిప్లా, ఇన్ఫోసిస్, ఐటీసీ, బీపీసీఎల్. టీసీఎస్, హెచ్డీఎఫ్సీ, హిందాల్కో టాప్ విన్నర్స్గా నిలవగా, బజాజ్ ఫిన్ సర్వ్,హెచ్యూఎల్, హెచ్పీసీఎల్, ఎం అండ్ ఎండ్, గెయిల్, భారీగా నష్టపోయాయి.