సాక్షి, ముంబై: దేశీయ స్టాక్మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఆరంభంలో ప్లాట్గా ఉన్నా అనంతరం అమ్మకాల జోరుతో ఏకంగా 330 పాయింట్లకు పైగా పతనమైంది. చివరకు సెన్సెక్స్ 300 పాయింట్లు కోల్పోయి 35, 474 వద్ద, నిఫ్టీ 107 పాయింట్లు పతనమై 10,656 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్నిరంగాలు నష్టాల్లోనే. మెటల్ బాగా నష్టపోగా టెక్, పార్మా, పీఎస్యూ బ్యాంక్స్ రంగ షేర్లు కూడా నష్టాల్లోనే ముగిశాయి. ఎస్బ్యాంకు హిందాల్కో, వేదాంతా విప్రో, టాటా స్టీల్, ఎన్టీపీసీ టాప్ విన్నర్స్గా నిలవగా ఇండస్ఇండ్, అదానీ పోర్ట్స్, గెయిల్, ఎంఅండ్ఎం, హెచ్పీసీఎల్, బీపీసీఎల్, టాటా మోటార్స్, ఐషర్, బజాజ్ ఫైనాన్స్ లాభపడ్డాయి