నష్టాల ముగింపు, 10900  దిగువకు నిఫ్టీ

7 Aug, 2019 15:44 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిసాయి. మిడ్‌ సెషన్‌ తరువాత 320 పాయింట్లకుపైగా నష‍్టపోయిన మార్కెట్లు చివరికి నష్టాల్లోనే ముగిసాయి.  ప్రధానంగా  ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్లు రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమీక్ష  అనంతరం క్రమంలో   నష్టాల్లోకి జారుకున్నాయి.  సెన్సెక్స్‌ 286  పాయింట్లు క్షీణించి 36,690 వద్ద,  నిఫ్టీ  93 పాయింట్లు నీరసించి 10,856 వద్ద  ముగిసింది. నిఫ్టీ 10900 స్థాయిని కూడా నిఫ్టీ కోల్పోయింది. 

ప్రధానంగా  బ్యాంకు నిఫ్టీ,  మెటల్‌, ఆటో నష్టపోగా,  మీడియా, ఫార్మా ఐటీ  స్వల్పంగా లాభపడ్డాయి.  ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ,  పీఎన్‌బీ, కెనరా,  బ్యాంకు ఆఫ్‌ ఇండియా,   యాక్సిస్‌, ఎస్‌బీఐ,  బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఐబీ హౌసింగ్‌ , టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, ఎంఅండ్‌ఎం, గెయిల్‌, ఐషర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గ్రాసిమ్‌, అదానీ పోర్ట్స్‌, ఐవోసీ నష్టపోగా జీ, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, సిప్లా, హెచ్‌యూఎల్‌, హీరో మోటో, హెచ్‌సీఎల్‌ టెక్, ఐసీఐసీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌   లాభపడ్డాయి. ఆర్‌బీఐ వరుసగా నాలుగోసారి రెపో రేటులో కోత పెట్టిన సంగతి తెలిసిందే. . దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి 71  స్థాయికి బలహీనపడింది
 

మరిన్ని వార్తలు