స్టాక్‌ మార్కెట్‌ డీలా..

20 Feb, 2020 11:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : గ్లోబల్‌ మార్కెట్ల సపోర్ట్‌, కరోనా వైరస్‌ బలహీనపడిందన్న సమాచారం స్టాక్‌ మార్కెట్లో ఉత్సాహం నింపలేదు. ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తుండటంతో స్టాక్‌ మార్కెట్లలో ట్రేడింగ్‌ ఫ్లాట్‌గా సాగుతోంది.

మెటల్‌ స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి నెలకొనగా, ఫార్మా షేర్లు స్వల్పంగా లాభపడుతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 20 పాయింట్ల నష్టంతో 41,302 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా,ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది.

చదవండి : బడ్జెట్‌ నష్టాలు భర్తీ

మరిన్ని వార్తలు