వరుసగా అయిదో సెషన్‌లోనూ లాభాలే

17 Dec, 2018 15:52 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా అయిదవ సెషన్లో  లాభాలతో ముగిశాయి. ఆరంభంనుంచి లాభాల జోరు సాగించిన సూచీలు మధ్యలో కొంత తడబడినా చివరకు స్థిరంగా ముగిసాయి. సెన్సెక్స్‌ 307 పాయింట్లు ఎగిసి 36,270వద్ద, నిప్టీ 83 పాయింట్లు లాభంతో  10,888 వద్ద  క్లోజ్‌ అయ్యాయి.  ఇంట్రా డేలో నిఫ్టీ 10990 స్థాయిని టచ్‌ చేయడం గమనార్హం. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే ముగిశాయి.

టాటామోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, కోల్‌ ఇండియా,  వేదాంతా, ఐసీఐసఘై విప్రో టాటా స్టీల్‌, రిలయన్స్‌,  ఐటీసీ మారుతి,  ఎం అండ్‌ ఎం,  టీసీఎస్‌, సన్‌ ఫార్మా టాప్‌ విన్నర్స్‌గా నిలిచాయి.  ఎస్‌బ్యాంకు, యాక్సిస్‌ బ్యాంకు, ఆసియన్‌ పెయింట్స్‌, హిందుస్థాన్‌ యూనీలీవర్‌, హీరోమోటా, భారతి ఎయిర్‌టెల్‌, ఇన్ఫోసిస్‌ కోటక్‌ బ్యాంకు  టాప్‌ లూజర్స్‌గా నమోదయ్యాయి.

మరిన్ని వార్తలు