మార్కెట్ల లాభాల దౌడు: ట్రిపుల్‌ సెంచరీ

16 Oct, 2018 14:40 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో కొనసాగుతున్నాయి. ట్రేడింగ్‌ ప్రారంభంనుంచీ అటు ఇన్వెస్టర్లు, ఇటు ట్రేడర్లు కొనుగోళ్లకు దిగడంతో కీలక సూచీలు జోరుగా కొనసాగుతున్నాయి.   ప్రస్తుతం 300 పాయింట్లు జంప్‌చేసి 35,165 వద్ద,  35వేల స్థాయిని అధిగమించింది.  నిఫ్టీ సైతం 76 పాయింట్లు పుంజుకుని 10,589 వద్ద ట్రేడవుతోంది. 

దాదాపు అన్ని రంగాలూ లాభాలను ఆర్జిస్తున్నాయి.  పీఎస్‌యూ బ్యాంక్స్‌,  ఐటీ, ఆటో, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ లాభపడుతున్నాయి.  ముఖ్యంగా బ్యాంకింగ్‌ సెక్టార్‌లో సెంట్రల్‌ బ్యాంక్‌, యూనియన్‌, కెనరా, పీఎన్‌బీ, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ బ్యాంక్‌, ఓబీసీ, స్టేట్‌బ్యాంక్‌, విజయా, సిండికేట్‌ బ్యాంక్‌ లాభాల జోష్‌ కొనసాగిస్తున్నాయి.  వీటితోపాటు  టెక్ మహీంద్రా, ఓఎన్‌జీసీ, ఎంఅండ్ఎం, ఐసీఐసీఐ, యాక్సిస్‌, బీపీసీఎల్‌, అదానీ పోర్ట్స్‌, ఆర్‌ఐఎల్‌, గ్రాసిమ్‌  టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. మరోవైపు  ఐబీ హౌసింగ్‌, హిందాల్కో, పవర్‌గ్రిడ్‌, సిప్లా, ఐషర్‌, జీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సన్‌ ఫార్మా, ఎన్‌టీపీసీ నష్టపొఓతున్నాయి. 

మరిన్ని వార్తలు