దూకుడుగా మార్కెట్లు : ట్రిపుల్‌ సెంచరీ 

6 Feb, 2019 15:13 IST|Sakshi

 సాక్షి, ముంబై:  స్టాక్ మార్కెట్లు లాభాలతో దూసుకుపోతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో ఆరంభం నుంచి లాభాల్లో కీలక సూచీలు  మరింత జోష్‌ను ప్రదర్శించాయి. కొనుగోళ్లు ఊపందుకోవడంతో  సెన్సెక్స్‌ ఏకంగా 300పాయింట్లకు పైగా జంప్‌ చేసింది. అలాగే నిఫ్టీ 11500 వైపు  పరుగులు తీస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 369 పాయింట్ల లాభంతో 36986 వద్ద,  125పాయింట్లు పెరిగిన నిఫ్టీ 11060 వద్ద  ఉంది.  ఫలితాల జోష్‌తో టెక్‌ మహాంద్రా భారీగా లాభపడుతోంది. ఇంకా హిందుస్తాన్‌ పెట్రోలియం, రిలయన్స్‌, జీ,  గెయిల్‌, పీఎన్‌బీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ కౌంటర్ల లాభాలు మార్కెట్లకు ఊతమిస్తున్నాయి. 

మరోవైపు ఆర్‌బీఐ మానిటరీ పాలసీ కమిటీ ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తింకాంత దాస్‌  నేతృత్వంలో  రేపు  కీలక వడ్డీరేట్లను ప్రకటించనుంది. 

మరిన్ని వార్తలు