లాభాల స్వీకరణ, అయినా ఓకే!

4 Nov, 2019 14:13 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డు లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణతో స్టాక్ మార్కెట్ ఇండెక్స్ సెన్సెక్స్ 93 పాయింట్లు ఎగిసి 40,258 వద్ద , నిఫ్టీ 36 పాయింట్ల లాభంతో 11927 వద్ద ట్రేడవుతోంది, ఈ రోజు కొన్ని లాభాలను అధిగమించడానికి ముందు సరికొత్త రికార్డును తాకింది. ఒక దశలో సెన్సెక్స్‌ 330 పాయింట్లకు పైగా ఎగిసి 40,500 వద్దకు, నిఫ్టీ కూడా రోజు గరిష్ట స్థాయికి పెరిగింది. ఆటె, మెటల్‌ షేర్లు లాభపడుతున్నాయి. యుఎస్-చైనా వాణిజ్య చర్చలపై ఆశావాహ వార్తలు మెటల్‌షేర్లకు పాజిటివ్‌గా మారాయి. యస్‌ బ్యాంకు దాదాపు 10 శాతం నష్టపోయింది. జీ, ఐవోసీ, మారుతి సుజుకి, హీరోమోటో, యాక్సిస్‌ బ్యాంకు, హెచ్‌యూఎల్‌ నష్టపోతుండగా, టాటా స్టీల్‌ వేదాంతా, ఇన్ఫోసిస్‌, ఓఎన్‌జీసీ ఐసీఐసీఐ బ్యాంకు లాభపడుతున్నా

మరిన్ని వార్తలు