సెన్సెక్స్ @ 25,000

16 May, 2014 10:05 IST|Sakshi

ముంబై: సార్వత్రిక ఎన్నికల ఫలితాల వేళ స్టాక్ మార్కెట్ సూచి సెన్సెక్స్ రివ్వున ఎగిసింది. సరికొత్త రికార్డు నమోదు చేసింది. చరిత్రలో తొలిసారి సెన్సెక్స్ 25,000 పాయింట్ల మైలురాయిని అందుకుంది. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన సెన్సెక్స్ 1,109 పాయింట్లు పెరిగి 25,014 స్థాయికి చేరుకుంది.

కేంద్రంలో ఎన్‌డీఏ ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న అంచనాలు బలపడుతుండటంతో మార్కెట్లు దూసుకెళుతున్నాయి. నిఫ్టీ కూడా భారీ స్థాయిలో పెరిగింది. 336 పాయింట్లు ఎగసి 7,459 మార్క్ ను అందుకుంది. అటు రూపాయి కూడా దూసుకెళుతోంది. 2013 తర్వాత డాలరుతో 59 పైసలు బలపడింది.

మరిన్ని వార్తలు