నష్టాల ముగింపు : బ్యాంకింగ్‌ షేర్లు పతనం

30 Apr, 2019 15:56 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు  స్వల్ప నష్టాల్లో ముగిసాయి. రోజంతా  నష్టాల్లో కొనసాగిన కీలక సూచీలు చివరలో నష్టాలను తగ్గించుకుని స్థిరంగా ముగిసాయి. సెన్సెక్స్‌ 36 పాయింట్లు నష‍్టంతో 39032 వద్ద, నిప్టీ 7 పాయింట్లు క్షీణించి 11748 వద్ద ముగిసాయి. ప్రధానంగా  బ్యాంకింగ్‌, ఆటో సెక్టార్‌ నష్టాలు మార్కెట్‌ను ప్రభావితం చేశాయి.  అయితే హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, టీసీఎస్‌ లాంటి ఐటీ  షేర్లలో కొనుగోళ్లు కనిపించాయి.  ఎస్‌ బ్యాంకు, ఇండస్‌ ఇండ్‌, రిలయన్స్‌, ఇండియా బుల్స్‌, భారతి ఇన్‌ప్రాటెల్‌, హీరో మోటో కార్ప్‌, మారుతి  టాప్‌ లూజర్స్‌గా నిలిచాయి.

మరిన్ని వార్తలు