సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు ఉత్సాహంగాకొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 428పాయింట్లు ఎగిసి 35160 వద్ద, నిఫ్టీ 138 పాయింట్లు ఎగిసి 10383 వద్ద పటిష్టంగా కొనసాగుతున్నాయి. ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. తద్వారా సెన్సెక్స్ 35 వేల ఎగువకు చేరగా, నిఫ్టీ 10300 ఎగువన జోరుగా ఉంది. అలాగు బ్యాంకింగ్ రంగ షేర్ల లాభాలతో నిఫ్టీ బ్యాంకు 3 శాతానికి పైగా ఎగిసింది.
హెవీ వెయిట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ జోరు కొనసాగుతోంది. ఐసీఐసీఐబ్యాంక్ కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభాలకు మార్కెట్ కు భారీ మద్దతునిస్తున్నండగా బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, సిప్లా, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్ భారీగా లాభపడుతున్నాయి. మరోవైపు, విప్రో, గ్రాసిమ్, హిందాల్కో, ఓఎన్జీసీ అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోతున్నాయి. మరోవైపు