దేశీయ స్టాక్మార్కెట్లు మిశ్రమంగా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో బుధవారం కూడా ఊగిసలాట ధోరణి నెలకొంది. ప్రస్తుతం సెన్సెక్స్ 40పాయింట్ల లాభంతో 38,200 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 11525 వద్ద కొనసాగుతోంది. దేశీయ కరెన్సీ వరుస నష్టాల నేపథ్యంలో ఐటీ సెక్టార్, ఇంకా ఫార్మ లాభపడుతుండగా, మెటల్ సెక్టార్ నష్టపోతోంది. ఇండస్ ఇండ్, హీరో మోటో కార్ప్, టాటా మోటార్స్, వేదాంతా, హిందుస్తాన్ యూనీలీవర్, కోల్ ఇండియా టాప్ లూజర్స్గా ఉన్నాయి. విప్రో, సన్ఫార్మ, ఐటీసీ, రిలయన్స్, ఎం అండ్ఎం, పవర్ గ్రిడ్, టెక్ మహీంద్ర, ఏషియన్ పెయింట్స్ లాభపడుతున్నాయి.