నష్టాల ప్రారంభం

31 Dec, 2019 09:25 IST|Sakshi

సాక్షి,ముంబై: 2019 ఏడాదికి ఆఖరి సెషన్‌ నష్టాలతో ప్రారంభమైంది. ఆరంభ నష్టాలనుంచి మరింత దిగజారి సెన్సెక్స్‌ 96 పాయింట్ల నష్టంతో 41459 వద్ద, నిఫ్టీ 28  పాయింట్లు బలహీనపడి 12227 వద్ద కొనసాగుతున్నాయి.  దాదాపు అన్ని రంగాల్లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది.

టెక్‌మహీంద్ర,జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటాస్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐషర్‌మోటార్స్‌ నష్టపోతున్నాయి. అటు యాక్సిస్‌ బ్యాంకు, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, సన్‌ఫార్మ, హెచ్‌యూఎల్‌, ఎస్‌బీఐ, ఐటీసీ పవర్‌గ్రిడ్‌ లాభపడుతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో దేశీయ కరెన్సీ  రూపాయి స్వల్ప లాభంతో ప్రారంభమైంది. సోమవారం నాటి ముగింపు 71.31 తో పోలిస్తే 5 పైసలు పుంజుకుని 71.26 వద్ద కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు