నష్టాల్లో సూచీలు, బ్యాంకింగ్‌ ఢమాల్‌

9 Sep, 2019 09:30 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ  ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా పరిస్దితుల నేపథ్యంలో కీలక సూచీలు నష్టాల వైపు మళ్లాయి. ముఖ్యంగా శుక్రవారం నాటి బ్యాంకింగ్‌ షేర్ల లాభాలు సోమవారం తుడిచి పెట్టుకపోయాయి. ఇన్వస్టెర్ల అమ్మకాలతో దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్‌ నిఫ్టీ 200 పాయింట్లకుపైగా పతనమైంది. సెన్సెక్స్‌ 190 పాయింట్లు క్షీణించి 36791వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు నష్టపోయి10892 వద్ద కొనసాగుతున్నాయి. ఫార్మ స్వల్పంగా లాభపడుతోంది. బ్యాంకింగ్‌ షేర్లలో యాక్సిస్‌, ఇండస్‌, కోటక్‌ తదితరాలతో పాటు, టాటా మోటార్స్‌, మారుతి, హీరో మోటో,  హిందాల్కో, నష్టపోతున్నాయి. మరోవైపు సన్‌ఫార్మ, లుపిన్‌, అరబిందో లాభపడుతున్నవాటిల్లో ఉన్నాయి. 
 

మరిన్ని వార్తలు