లాభాల బాటలో స్టాక్‌ మార్కెట్లు

19 Feb, 2020 10:07 IST|Sakshi

ముంబై : స్టాక్‌ మార్కెట్లో నాలుగు రోజుల వరుస నష్టాలకు బ్రేక్‌ పడింది. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో కీలక సూచీలు లాభాల బాటపట్టాయి. మెటల్‌, ఫార్మా షేర్లు భారీగా లాభపడుతున్నాయి. ఎన్టీపీసీ, ఓఎన్‌జీసీ, హెస్‌సీఎల్‌ టెక్‌ షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 310  పాయింట్ల లాభంతో41,204 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా 79 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,072 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

చదవండి : టెలికాం షాక్‌, నాలుగో రోజు నష్టాలు

మరిన్ని వార్తలు