స్టాక్‌ మార్కెట్లకు గ్లోబల్‌ జోష్‌

1 Jul, 2019 10:47 IST|Sakshi

ముంబై : అంతర్జాతీయ మార్కెట్ల మద్దతుతో స్టాక్‌ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో పలు షేర్లు లాభపడుతున్నాయి. బ్యాంక్‌, మెటల్‌ సహా కీలక సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది.

బజాజ్‌ ఆటో, ఎన్‌టీపీసీ, హీరో మోటోకార్ప్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ తదితర షేర్లు టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. ఇక 215 పాయింట్లు లాభపడిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 39,609 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 47 పాయింట్లు పెరిగిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,836 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.

>
మరిన్ని వార్తలు