లాభాల ప్రారంభం

26 May, 2020 09:34 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్ మార్కెట్  భారీ లాభాల్లో ప్రారంభమైంది.  వెంటనే మరింత  పుంజుకుని  సెన్సెక్స్ 400 పాయింట్లు ఎగిసి 31 వేల ఎగువన స్థిరంగా కొనసాగుతోంది. నిఫ్టీ 105 పాయింట్లు ఎగిసి 9146 వద్ద ట్రేడ్ అవుతోంది.  బ్యాంకు నిఫ్టీ 300 పాయింట్లకు పైగా లాభపడుతోంది.  యితే నిఫ్టీకి 9150 స్థాయి,  సెన్సెక్స్ 31 వేల స్థాయి కీలకమని అప్రమత్తత అవసరం ఎనలిస్టులు సూచిస్తున్నారు.  ప్రస్తుతం లాభ నష్టాల ఊగిసలాట కొనసాగుతోంది. 

ఫలితాల ప్రభావంతో హెచ్ డీఎఫ్ సీ  భారీగా లాభపడుతోంది.  ఇంకా ఐటీసీ,  జెఎస్ డబ్ల్యూ స్టీల్, భారతి ఇన్ ఫ్రాటెల్, టాటా స్టీల్ ఇండస్ ఇండ్  లాభాల్లో ఉన్నాయి. మరోవైపు బాటా, అవెన్యూ సూపర్ మార్కెట్ ,  భారతి  ఎయిర్టెల్ ,  డీసీబీ నష్టపోతున్నాయి.
 

మరిన్ని వార్తలు