ఫ్లాట్‌గా ఎంట్రీ ఇచ్చిన మార్కెట్లు

15 Mar, 2018 09:36 IST|Sakshi
స్టాక్‌ మార్కెట్లు (ఫైల్‌ ఫోటో)

ముంబై : దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం స్తబ్ధుగా ప్రారంభమయ్యాయి. గ్లోబల్‌ మార్కెట్ల నుంచి సంకేతాలు ప్రతికూలంగా వస్తుండటంతో, మార్కెట్లు ఫ్లాట్‌గా ఎంట్రీ ఇచ్చాయి. 55 పాయింట్ల నష్టంలో ప్రారంభమైన సెన్సెక్స్‌, ప్రస్తుతం 16 పాయింట్ల నష్టంలో 33,819 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ స్వల్పంగా 4 పాయింట్ల నష్టంలో 10,406 వద్ద కదులుతోంది. ప్రారంభ ట్రేడింగ్‌లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, విప్రో, టెక్‌ మహింద్రా, టీసీఎస్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌, వేదాంతా, అరబిందో ఫార్మా, ఎం అండ్‌ ఎంలు లాభాలార్జించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ కూడా 53 పాయింట్లు పైకి ఎగిసింది.

ఇండియా ఆయిల్‌, ఇన్ఫోసిస్‌, ఎన్‌టీపీసీ, బీపీసీఎల్‌ షేర్లు 0.6 శాతం నుంచి 3 శాతం కిందకి పడిపోయాయి. మరోవైపు ట్రేడ్‌ ఆందోళను పెరుగుతుండటంతో, ఆసియన్‌ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ టారిఫ్‌లు విధించబోతున్నట్టు తెలుస్తుండటంతో, వరుసగా మూడో రోజు వాల్‌స్ట్రీట్‌ షేర్లు పడిపోయాయి. ఈ టారిఫ్‌లు ఇరు దేశాలకు మధ్య ట్రేడ్‌వార్‌ ఆందోళనలను పెంచుతున్నాయని విశ్లేషకులంటున్నారు. 

మరిన్ని వార్తలు