స్వల్ప లాభాలతో కదులుతున్న స్టాక్‌మార్కెట్‌

22 Oct, 2018 13:46 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  స్వల్ప లాభాలతో కదులుతున్నాయి.  ఆరంభంలో స‍్తబ్దుగా ఉన్న సూచీల్లో ఒక దశలో 100 పాయింట్లుగా  పుంజుకున్న  సెన్సెక్స్‌ 96 పాయింట్లు లాభపడి  34,411 వద్ద,  నిఫ్టీ 20 పాయింట్లు  బలపడి 10,323 వద్ద  ట్రేడ్‌ అవుతున్నాయి.  బ్యాంక్‌ నిఫ్టీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ  లాభాలతోనూ,  ఐటీ,  మెటల్‌  స్వల్ప నష్టాలతోనూ కొనసాగుతున్నాయి.  ఐబీ హౌసింగ్‌  భారీ లాభపడుతుండగా, ఐసీఐసీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, గెయిల్‌, ఐషర్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, యాక్సిస్‌ బ్యాంక్‌ ఇతర టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి.  బీపీసీఎల్‌, అల్ట్రాటెక్‌, యస్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌, టెక్‌ మహీంద్రా, ఐవోసీ, ఓఎన్‌జీసీ, హెచ్‌పీసీఎల్‌, గ్రాసిమ్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు