ఆటో జోరు :  సెన్సెక్స్ డబుల్ సెంచరీ

1 Jul, 2020 10:09 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ  స్టాక్ మార్కెట్ లాభాల్లో కొనసాగుతోంది.  ఆరంభంలో  స్వల్పంగా లాభపడిన సూచీలు  అనంతరం పుంజుకున్నాయి. సెన్సెక్స్ 214 పాయింట్లు ఎగిసి 35115 వద్ద, నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 10355 వద్ద స్థిరంగా  ట్రేడ్ అవుతోంది. ఆటో,  ఫైనాన్స్ , ఎఫ్‌ఎంసీజీ, ఐటీ లాభపడుతుండగా, మీడియా, మెటల్‌, ఫార్మా, రియల్టీ  రంగాలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. 

బజాజ్‌ ఆటో, యుపీఎల్, యాక్సిస్ బ్యాంక్, ఐటీసీ, హెచ్‌డిఎఫ్‌సీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్  అత్యధిక  లాభాల్లో ఉన్నాయి.  మరోవైపు ఎన్‌టిపిసి, కోటక్ మహీంద్రా బ్యాంక్, లార్సెన్  అండ్ టుబ్రో, భారతి ఇన్‌ఫ్రాటెల్,   బ్రిటానియా, జీ లిమిటెడ్‌  నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు