నష్టాలకు చెక్‌, లాభాల జోష్‌

23 Jan, 2020 15:42 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతోముగిసాయి. గత నాలుగు సెషన్లుగా అమ్మకాల ఒత్తిడితో బలహీన పడిన సూచీలు గురువారం లాభాలతో ముగిసాయి. సెన్సెక్స్‌ 271 పాయింట్లు ఎగిసి 41386 వద్ద, నిఫ్టీ 73 పాయింట్లు లాభపడి 12180 వద్ద స్థిరపడ్డాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడ్డాయి. ఎల్‌ అండ్‌టీ, ఎస్‌బీఐ, టైటన్‌, భారతి ఎయిర్టెల్‌, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, ఓఎన్‌జీసీ యాక్సిస్‌ బ్యాంకు టాప్‌ విన్నర్స్‌గా ఉండగా, జీ, యూపీఎల్‌, సిప్లా, టెక్‌ మహీంద్ర, డా.రెడ్డీస్‌, ఐషర​ మోటార్స్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ టీసీఎస్‌ నష్టపోయాయి

మరిన్ని వార్తలు