ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభం అయ్యాయి. ఆరంభంలోనే బీఎస్ఈ సెన్సెక్స్ 250 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 50 పాయింట్ల నష్టపోయింది. ఆసియా స్టాక్ మార్కెట్ల ప్రతికూల ప్రభావం మన మార్కెట్ల మీద ప్రభావం చూపుతోంది. సెన్సెక్స్ 276 పాయింట్ల నష్టంతో 26,359.46 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక నిఫ్టీ 85 పాయింట్ల నష్టంతో 8,100 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక షేర్ల విషయానికి వస్తే ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు భారీగా నష్టపోయాయి. మరోవైపు రూపాయి పుంజుకుంది. డాలర్తో పోల్చితే రూపాయి మారకం విలువ 67 పైసలుగా నమోదైంది.