స్టాక్‌ జోరుకు బ్రేక్‌..

5 Nov, 2019 12:34 IST|Sakshi

ముంబై : స్టాక్‌ మార్కెట్లలో వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. పలు రంగాల షేర్లలో అమ్మకాల ఒత్తిడితో బీఎస్‌ఈ సెన్సెక్స్‌, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలు సరికొత్త గరిష్ట స్ధాయిల నుంచి దిగువకు పడిపోయాయి. పీఎస్‌యూ బ్యాంకులు, మెటల్‌ మినహా అన్ని సూచీలు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మొత్తంమీద సెన్సెక్స్‌ వంద పాయింట్ల పైగా నష్టంతో 40,166 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 33 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ 12వేల పాయింట్ల దిగువన ట్రేడవుతోంది.

మరిన్ని వార్తలు