ముంబై: అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల స్పందనలతో స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 530 పాయింట్ల నష్టంతో 25వేల 233 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 152 పాయింట్ల నష్టంతో 7670 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఇక సెక్టార్ సూచీల్లో బ్యాంకెక్స్ 3.24శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 2.49శాతం, మెటల్ సూచీలు 2.49శాతం నష్టపోతున్నాయి. నిఫ్టీ టాప్ గేయినర్స్ లిస్ట్లో సిప్లా 1.13వాతం,ల్యూపిన్ 0.30శాతం , హిందుస్తానీ యూనిలివర్ 0.002శాతం, నిప్టీ టాప్ లూజర్స్ లిస్ట్లో 4.71శాతం, బ్యాంక్ అఫ్ బరోడా 4.58శాతం, కోటక్ బ్యాంక్ 4.48శాతం నష్టపోతున్నాయి.