ముంబై: స్టాక్మార్కెట్లు గురువారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 77 పాయింట్ల లాభాలతో సెన్సెక్స్ 26,917 దగ్గర, నిఫ్టీ 18 పాయింట్ల లాభంతో 8,142 దగ్గర ట్రేడవుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లలో కొనుగోళ్ల ట్రెండ్ నెలకొంది. అంతర్జాతీయ మార్కెట్లో బలపడిన రూపాయి విలువ మార్కెట్ను ప్రభావితం చేస్తోంది.
ప్రధానంగా రియాల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ , హెల్త్కేర్, క్యాపిటల్ షేర్లు, ఐటి సెక్టార్ మార్కెట్ను లీడ్ చేస్తున్నాయి. నిన్నటి లాభాలతో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగే అవకాశం ఉన్నందున ట్రేడర్లు అప్రమత్తంగా ఉండాలని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. మరోవైపు డాలర్ తో పోలిస్తే రూపాయి 7 పైసలు లాభపడి 63.76 దగ్గర ఉంది.