సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభనష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. గురువారం నవంబర్ డెరివేటివ్ సిరీస్ ముగియనుండటంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత కొనసాగుతోంది. దీంతో సెన్సెక్స్20 పాయింట్లు క్షీణించి 33,598వద్ద, నిఫ్టీ 7పాయింట్లు నీరసించి 10,362 వద్ద ట్రేడవుతోంది. అటు ఫార్మా, రియల్టీ సెక్టార్ జోరుకొనసాగుతోంది.
బాష్, శ్రీరామ్ ట్రాన్స్, హెక్సావేర్, గ్రాన్యూల్స్, శ్రీరామ్ , సౌత్ ఇండియన్ బ్యాంక్, బాష్, ఎన్బీసీసీ, భారత్ ఎలక్ట్రానిక్స్, హింద్ జింక్, కోల్ ఇండియా, వోల్టాస్ లాభాల్లోనూ, దాల్మియా భారత్, కేపీఐటీ, సెయిల్, ఆర్కామ్, రిలయన్స్ నావల్, పీసీ జ్యువెలర్స్, అదానీ పవర్, సీమెన్స్, డీసీబీ బ్యాంక్ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.