సెంచరీకి పైగా లాభాలతో మార్కెట్లు

12 Apr, 2019 14:24 IST|Sakshi

దేశీ స్టాక్‌ మార్కెట్లు  లాభాలతో కదులుతున్నాయి.  ఆరంభం లాభాలనుంచి మరింత ఎగిసి సెన్సెక్స్‌ 182 పాయింట్లు బలపడి 38,788 వద్ద నిఫ్టీ 51 పాయింట్ల లాభంతో 11,648 వద్ద ట్రేడవుతోంది. బ్యాంకింగ్‌, ఆటో ఐటీ, ఫార్మా, మెటల్‌, రియల్టీ  ఇలా అన్నిరంగాలు దాదాపు  లాభాల్లో ట్రేడ్‌అవుతున్నాయి. 

బీపీసీఎల్‌, గెయిల్‌, ఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌, జీ, ఇన్ఫ్రాటెల్‌, అదానీ పోర్ట్స్‌, యస్‌ బ్యాంక్‌  లాభపడుతుండగా,  గ్రాసిమ్‌, బజాజ్‌ ఆటో, టాటా మోటార్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ నష్టపోతున్నాయి. టెక్‌దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ ఈ రోజు ఫలితాలను    ప్రకటించే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు